MLG: వెంకటాపూర్ మండలం రామానుజపురంలో మే 1 నుంచి జరిగే నాంచారమ్మ జాతరకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు కోరారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ దివాకరకు వినతిపత్రం సమర్పించారు. జాతరకు రోడ్లు, విద్యుత్, తాగునీరు, శానిటేషన్, పార్కింగ్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.