SRD: హత్నూర మండలం పాల్పనూర్ గ్రామంలో ఉగాది మరుసటి రోజున నిర్వహించే భ్రమరాంభ మల్లికార్జున స్వామి ఉత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం స్వామివారి కల్యాణ మహోత్సవం నిర్వహించగా, సాయంత్రం ఒగ్గు పూజారుల నృత్యాల మధ్య బండ్లు, బోనాల ఊరేగింపు కనువిందుగా సాగింది. గ్రామస్థులు, బంధువుల రాకతో పాల్పనూర్లో పండుగ వాతావరణం నెలకొంది.