PDPL: అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి కింద ఉన్నత విద్య కోసం ఎస్సీ విద్యార్థులు మార్చి 31లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి రవీందర్ తెలిపారు. 4 సంవత్సరాల డిగ్రీ చదివి గ్రాడ్యుయేషన్లో 60% మార్కులు, కుటుంబ ఆదాయం రూ.5 లక్షల లోపు ఉండాలన్నారు. అభ్యర్థులు https://telanganaepass.cgg.gov.in ద్వారాదరఖాస్తు చేసుకోవాలన్నారు.