ADB: బాధితుల పట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోమవారం పోలీసు ముఖ్య కార్యాలయంలో గ్రీవెన్స్ డే సందర్భంగా ప్రజా ఫిర్యాదులను నేరుగా స్వీకరించారు. బాధితుల సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, త్వరితగతిన పరిష్కారానికి కృషి చేయాలని సంబంధిత సిబ్బందికి తెలియజేశారు.