KDP: ప్రొద్దుటూరులో పోలీసులు మానవతా హృదయంతో ముందుకొచ్చారు. ఆత్మహత్యకు పాల్పడిన దంపతుల ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారడంతో, వారిని సంరక్షణలో ఉంచారు. అనంతరం జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. సీఐ నాగభూషణ్, ఎస్సై శ్రీకాంత్ చిన్నారులకు ఆర్థిక సహాయం అందించి ధైర్యం చెప్పారు. పిల్లలను జిల్లా అమ్మవడి శరణాలయానికి తరలించి సంరక్షణ కల్పిస్తున్నారు.