KNR: మీర్జంపేటకు చెందిన కేశవేణి సాగర్ వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ. 23 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును మాజీ ఎంపీటీసీ సదానందం గౌడ్ బుధవారం అందజేశారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నిరుపేదల వైద్య భారాన్ని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆపదలో అండగా నిలుస్తున్న సీఎంఆర్ఎఫ్ పేదలకు కొండంత ఆసరా అని పేర్కొన్నారు.