MBNR: మిడ్జిల్ మండలంలోని మంగళగడ్డ గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సర్పంచ్ చందు నాయక్ శనివారం భూమిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. గూడు లేని ప్రతి నిరుపేదకు సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అర్హులైన వారందరికీ ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్య దర్శి నవీన్, ఎస్టీ సెల్ నాయకుడు శ్రీనివాస్, సీతారాం, తదితరులు పాల్గొన్నారు.