VKB: నిరక్షరాస్యులుగా ఉన్న మహిళలకు చదవడం, రాయడం వంటి వాటిని నేర్పించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ‘ఉల్లాస్ కార్యక్రమం’ ముఖ్య లక్ష్యమని ధారూర్ మండలం రాజాపూర్ సర్పంచ్ కురువ దివ్య అన్నారు. ఆదివారం స్థానిక పాఠశాల ఆవరణంలో మహిళా సంఘం సభ్యులకు ఉల్లాస పరీక్షను నిర్వహించారు. పరీక్షకు గ్రామ మహిళలు పెద్ద ఎత్తున హాజరైనట్లు ఆమె పేర్కొన్నారు.