JGL: వాల్మీకి ఆవాసం సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కుట్టు, కంప్యూటర్ శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ.. ఉచిత శిక్షణలను వినియోగించుకొని యువత ఉపాధి అవకాశాలు పెంచుకోవాలని సూచించారు.సేవా భారతి ఎన్నో ఏళ్లుగా నిరుపేదలకు విద్య,ఉపాధి శిక్షణ అందించడం అభినందనీయమన్నారు.