నిర్మల్: కడెం మండలం అల్లంపెల్లిలోని జీయర్ గురుకులం విద్యార్థిని గోపు నిహారిక ఆర్చరీలో ఉత్తమ ప్రతిభ కనబరిచి వెండి పథకం సాధించింది. ఇటీవల ఖమ్మంలో జరిగిన రాష్ట్ర స్థాయి ‘సీఎం-కప్’ అర్చరీ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి వెండి పథకం సాధించిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు చక్రధర్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందించారు.