NLG: ఉమ్మడి నల్గొండ జిల్లాలో ‘మహాలక్ష్మి’ పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే మహిళలకు త్వరలోనే స్మార్ట్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి. ప్రతి జిల్లా నుంచి ఒక్కో మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ ఎంపిక చేసి, మొదటి విడతలో 5 లక్షల మందికి ఈ స్మార్ట్ కార్డులను పంపిణీ చేయనున్నారు. కార్డుల పంపిణీ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు.