ADB: నార్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం రేపటి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పరీక్ష CS వెంకటకేశవులు తెలిపారు. ఫస్టియర్ 200 మంది, సెకండియర్ 187 మంది ఉండగా.. మొత్తం 387 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని వెల్లడించారు. పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వాహిష్ఠమని ఆయన పేర్కొన్నారు.