NZB: పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రంజాన్ తోఫాను మంగళవారం చందూర్ మండలం ఘన్ పూర్ గ్రామ ముస్లింలకు తహసీల్దార్ వీర్ సింగ్, ఘన్ పూర్ సర్పంచ్ ముత్తకుంట కృష్ణ అందజేశారు. ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు.