NRML: కుంటాల మండలంలోని 15 గ్రామపంచాయతీల పరిధిలో ప్రభుత్వం 264 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి గృహ నిర్మాణానికి వేగం పెంచినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 75 ఇళ్లు స్లాబ్ స్థాయిలో, 106 రూఫ్ లెవెల్లో, 135 బేస్మెంట్ దశలో కొనసాగుతున్నాయన్నారు. ఇప్పటికే 7 ఇళ్లు పూర్తి కాగా, మరో 13 ఇళ్లు తుదిదశలో ఉన్నాయి. అధికారులు పనులను పర్యవేక్షిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని చర్యలు చేపడుతున్నామన్నారు.