MNCL: బెల్లంపల్లి మండలంలో రేపు పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద 163BNSS సెక్షన్ అమలులో ఉంటుందని 1 టౌన్ SHO శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. ఆయా పరీక్షా కేంద్రాల వద్ద ప్రజలు గుమిగుడి ఉండవద్దన్నారు. గంట ముందు నుంచి పరీక్ష పూర్తయిన గంట వరకు అన్ని జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని ఆదేశించారు.