MNCL: జైపూర్ మండలంలోని వేలాలలో వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శనివారం విద్యుత్ శాఖ అధికారులు గ్రామాన్ని సందర్శించి పుష్కర ఘాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఏర్పాట్లపై సమీక్షించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ డేగ స్వప్న నగేష్, డీఈ దుర్గం మల్లేశం, ఎఈ మనోహర్, ఫోర్ మెన్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.