SRD: జహీరాబాద్ పట్టణంలో పలు వార్డులలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా మారింది. నాలాలు చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్ధాలు పిచ్చి మొక్కలతో మూసుకుపోయి మురికి నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలువల్లో పూడిక పేరుకుపోవడంతో దుర్వాసన వ్యాపిస్తూ రోగాల భయం నెలకొంది. వర్షాలకు ముందే డ్రైనేజీలు శుభ్రం చేసి ఉంచాలని స్థానికులు ప్రజలు కోరుతున్నారు.