SRPT: జిల్లాలో ఉక్కా విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈరోజు సూర్యాపేటలోని రెండు వస్త్ర దుకాణాలపై దాడులు చేసి రూ.15 వేల విలువైన ఉక్కాను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ కె. నరసింహ తెలిపారు. ముగ్గురిపై కేసులు నమోదు చేశామన్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఎస్పీ హెచ్చరించారు.