KDP: ఒంటిమిట్ట నడివీధి గంగమ్మ అమ్మవారి జాతర గురువారం ఘనంగా ప్రారంభమైంది. వేకువజామున అమ్మవారిని మంగళవాయిద్యాలు, మేళ తాళాల మధ్య ఊరేగింపుగా తీసుకొచ్చి నడివీధిలో కొలువుదీర్చారు. అమ్మవారిని పుష్పమాలికలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకొని పూజలు చేశారు.