ADB: జంధాపూర్ గ్రామ ప్రజల చిరకాల కోరికైన స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటుపై జిల్లా కలెక్టర్ రాజర్షి షాకు వినతిపత్రం సమర్పించారు. గ్రామ ప్రధాన రహదారిపై వాహనాలు అతివేగంగా వెళ్తుండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించి వేగ నియంత్రకాలు ఏర్పాటు చేసి ప్రాణనష్టం జరగకుండా చూడాలన్నారు.