MBNR: జిల్లా వ్యాప్తంగా రైతులకు అవసరమైన మేరకు యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బోవల్ల వెంకటేష్ అన్నారు. గురువారం సాయంత్రం మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాలను సందర్శించారు. యూరియా విషయంలో రైతులు ఎటువంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నరేందర్ పాల్గొన్నారు