GDWL: మల్దకల్లో ఈనెల 17న (మంగళవారం) రైతు సంబరాల ప్రాంగణంలో పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల సంత ప్రారంభమవుతుంది. రైతులు, వ్యాపారస్తులు ఈ సంతను సద్వినియోగం చేసుకుని తమ వ్యాపారాన్ని ప్రోత్సహించడమే కాక, గ్రామ అభివృద్ధికి కూడా సహకరించాలని సర్పంచ్ చిట్టెమ్మ గోపాల్, కార్యదర్శి మాబి అన్నారు. ప్రతి ఒక్కరు పాల్గొని సంతని విజయవంతం చేయాలని వారు కోరారు.