JNG: సింగరాజుపల్లి టోల్ గేట్ సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బియ్యం లోడుతో ఉన్న బొలెరో ట్రాలీ ట్రాక్టర్ను ఢీ కొట్టింది. దీంతో బొలెరో ట్రాలీ నడిరోడ్డుపై రోడ్డుకు అడ్డంగా పల్టీ కొట్టి తలక్రిందులుగా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలవగా.. స్థానికులు వారిని జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.