BDK: కరకగూడెం(M) అశ్వాపురంపాడులో గత నెల 28న జరిగిన కొవ్వాసి వెంకటేశ్వర్లు హత్యకేసును పోలీసులు ఛేదించారు. పాతకక్షల నేపథ్యంలో రూ.50 వేల సుపారీ ఇచ్చి వెంకటేశ్వర్లును హతమార్చినట్లు CI వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ నేరానికి పాల్పడిన వజ్జ భీమరాజు మడివి మంగయ్య, మడివి నందయ్య సహా ఐదుగురు నిందితులను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.