HYD: నగరంలోని పలు ఆర్టీఏ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నాగోల్, కొండాపూర్, మేడ్చల్ కార్యాలయాల్లో ఆన్లైన్ ఫీజుల కంటే అదనంగా వసూలు చేస్తూ అవకతవకలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఈ సోదాల్లో కొండాపూర్లో 150 ప్రింటెండ్ ఆర్సీలు, డీఎల్లను స్వాధీనం చేసుకోగా, నాగోల్ కార్యాలయంలో ఏజెంట్ల వద్ద రూ.2.41 లక్షల నగదు పట్టుబడింది.