SRCL: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ అన్నదాన ట్రస్టుకు ఓ భక్తుడు రూ.2లక్షలు విరాళం శుక్రవారం అందజేశారు. హైదరాబాద్లోని కోకాపేట్కు చెందిన బొమ్మవేణి సౌజన్య -రాజేశ్వర్ రెడ్డి దంపతులు రూ.2లక్షలు విరాళం అందించగా, అన్నప్రసాదానికి రూ.1.82లక్షలు, శాశ్వత అభిషేకానికి రూ.18వేలు సమర్పించారు. ఈ మొత్తాన్ని ప్రొటోకాల్ పర్యవేక్షకులు శ్రీనివాస్కు అందజేశారు.