SS: నల్లమాడ మండలం దొన్నికోట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు హుండాయ్ మొబిస్ ఇండియా సంస్థ CSR కింద భారీ విరాళం అందజేసింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ యంగ్ యుయోంగ్ జూక్ ఆధ్వర్యంలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు కోసం 20 కంప్యూటర్లు, టేబుళ్లు, కుర్చీలతో పాటు ఫ్యాన్లు, లైట్లను పంపిణీ చేశారు. ప్రధానోపాధ్యాయురాలు గీత, ఉపాధ్యాయ బృందం సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.