RR: శంషాబాద్ ఏరియాలో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జనరల్ కౌన్సిల్ మీటింగ్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రసంగించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో విజన్ 2047తో మౌలిక వసతులు బలోపేతం చేస్తున్నామని, రీజినల్ రింగ్ రోడ్, హైవేలు, ఫ్లైఓవర్లు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలతో కనెక్టివిటీ పెంచి పరిశ్రమలు, యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యమన్నారు.