HNK: కాకతీయ యూనివర్సిటీ(KU)పరిధిలో 2026-27 విద్యా సంవత్సరం నుంచి పీజీ కోర్సులకు నూతన సిలబస్ అమలు చేయనున్నారు. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కే. ప్రతాపరెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం మార్గదర్శకత్వంలో 23 పీజీ కోర్సుల సిలబస్ రూపకల్పన కొనసాగుతోంది. టెక్నాలజీ, ఏఐ, వాల్యూ ఎడ్యుకేషన్, నైపుణ్యాభివృద్ధి అంశాలను కోర్సుల్లో చేర్చనున్నారు.