ములుగు జిల్లా ఇంచర్ల శివారులోని ఎర్రి గట్టమ్మ వద్ద నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ, నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈఈ అజయ్ కుమార్, డిఈ లింగ రెడ్డి, కాంట్రాక్టర్ కృష్ణ, అధికారులు ఉన్నారు.