నల్గొండ పట్టణంలోని, బొట్టుగూడ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం బిక్షపతి గురువారం సందర్శించారు. అత్యాధునికంగా నిర్మించిన పాఠశాలలో అన్ని తరగతి గదులను పరిశీలించారు. మంత్రి కోమటిరెడ్డి ద్వారా ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్తో ఎనిమిది కోట్లతో నిర్మించిన పాఠశాలలో తరగతి గదుల్లో గల సౌకర్యాలను, ఉపాధ్యాయుల భోదన గురించి తెలుసుకున్నారు.