ATP: అనంతపురం అహుడా కార్యాలయంలో ఛైర్మన్ టీసీ వరుణ్, వైస్ ఛైర్ పర్సన్ విష్ణు చరణ్ గ్రీవెన్స్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం జరిగిన సమీక్షలో ఎంఐజీ లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పన వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో పింక్ టాయిలెట్లు, స్విమ్మింగ్ పూల్ నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలని సూచించారు.