ASR: డుంబ్రిగూడ మండలం కింజేరు గ్రామంలో ఆదివాసీ గిరిజన సంఘం, పీపుల్స్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 140 మంది రోగులు వైద్య సేవలు పొందారు. డా ఎం.ఐ. విజయ్ భాస్కర్ రోగులను పరీక్షించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ శిబిరం నిర్వహించినట్లు పేర్కొన్నారు.