చిత్తూరు జిల్లా సాయుధ దళం కార్యాలయం వెలుపల ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా ఎస్పీ తుషార్ డూడి ప్రారంభించారు. వేసవి వేడి నేపథ్యంలో ప్రజలకు శుద్ధి చేసిన చల్లని త్రాగునీరు అందించేందుకు ఏఆర్ పోలీసు విభాగం ఆధ్వర్యంలో ఈ కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రజలకు ఉపశమనం కలిగించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు పాల్గోన్నారు.