NLG: చిట్యాల మండలం, ఉరుమడ్ల రైతు వేదికలో నూతనంగా ఎన్నికైన వార్డు మెంబర్లకు నిర్వహించిన మొదటి విడత శిక్షణ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో జయలక్ష్మి హాజరై మాట్లాడుతూ శిక్షణను సద్వినియోగం చేసుకొని వార్డుల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఎంపీఓ కోటేష్, ట్రైనర్ యూసుఫ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.