PDPL: జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో వివాదం చోటుచేసుకుంది. పాఠశాల పైకప్పుపై ఉన్న చెత్తను ఐదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులతో ఉపాధ్యాయులు శుభ్రం చేయించారని స్థానికులు తెలిపారు. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులపై ఉన్నతధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.