NLG: ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ 7వ వార్డు కౌన్సిలర్ దేశపాక లత రాజేష్ ఆదర్శంగా నిలిచారు. తన వార్డులో ఆడపిల్లల వివాహానికి రూ.15,116 పెళ్లి కానుకగా ఇస్తానన్న మాట ప్రకారం, ఇవాళ బొల్గూరి యాదయ్య కుమార్తె వివాహానికి ఆ మొత్తాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పోకల దేవదాసు, శామ్యూల్, అశోక్, ఏసురత్నం తదితరులు పాల్గొని కౌన్సిలర్ను అభినందించారు.