WNP: వనపర్తి మండలం రాజనగరం PACSలో రైతులకు పంపిణీ చేసేందుకు 450 యూరియా బస్తాలు సిద్ధంగా ఉన్నట్లు PACS కార్యదర్శి మహేందర్, సింగల్ విండో డైరెక్టర్ సంజీవ్ సాగర్ తెలిపారు. ఇవాళ ఉదయం 10:30 గంటలకు యూరియా బుకింగ్ యాప్ ఓపెన్ అవుతుందని.. అవసరం ఉన్న రైతులు యూరియా బుక్ చేసుకోవాలని కోరారు. యూరియా తీసుకొనేప్పుడు రైతు ఆధార్, పట్టాదార్ పాస్ పుస్తకం జిరాక్సులు ఇవ్వాలన్నారు.