NGKL: వంగూర్ మండలం అన్నారం, సర్వారెడ్డి పల్లి తండా గ్రామాల్లో శనివారం ఎంపీడీవో బ్రహ్మచారి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీల్లో రికార్డులను పరిశీలించి, పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. అనంతరం కూలీలతో సమావేశమై.. ఉపాధి హామీ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.