JN: జనగాం జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీ నారాయణ లకావత్ నేడు తీవ్రంగా స్పందించారు. తెలంగాణ అసెంబ్లీలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతున్న సమయంలో ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరు, ఉపయోగించిన భాషను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. నిండు సభలో ఒక దళిత ఎమ్మెల్యేను బెదిరించడం అత్యంత హేయమైన చర్య అని ఆమె అన్నారు.