MNCL: ఇళ్ల పరిసరాలలో చెత్తను, పనికిరాని వస్తువులను ఉంచవద్దని దండేపల్లి మండల అధికారులు సూచించారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం దండేపల్లితో పాటు లింగాపూర్, తాళ్లపేట, మేదరిపేట, మామిడిపల్లి, లింగాపూర్, ద్వారక, గుడిరేవు, వెల్గనూర్ అన్ని గ్రామాలలో ప్రజాప్రతినిధులు, అధికారులు వివిధ కార్యక్రమాలు చేపట్టారు.