NLR: రెవెన్యూ అధికారులందరూ చట్టాలపై అవగాహన పెంచుకుని ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన రెవెన్యూ అధికారుల కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. మ్యూటేషన్లు, రీ-సర్వే, 22ఏ వంటి అంశాల్లో పెండింగ్ లేకుండా చూడాలన్నారు. ప్రతి నెలా సమీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.