MDK: అల్లాదుర్గం మండలంలోని ముస్లాపూర్ గ్రామంలో దుర్గమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ రేణుక రెడ్డి, ఎస్సై శంకర్ పర్యవేక్షణలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. జాతర ప్రశాంతంగా సాగేలా అధికారులు అన్ని చర్యలు చేపట్టారు.