MBNR: అల్లా ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ అన్నారు. శనివారం మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని 49వ డివిజన్లో మైనార్టీ నేత ఉమెన్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసి మెలిసి జీవించాలని కోరారు.