BHPL: మొగుళ్లపల్లి మండలంలోని రైతులకు సోడిక్, లవణ నేలల సమస్య తగ్గించి పంట దిగుబడి పెంచేందుకు 90 శాతం రాయితీపై జిప్సం అందిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి సురేందర్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఒక టన్ను జిప్సం ధర రూ.5,660 కాగా, రైతులు కేవలం 10 శాతం అంటే రూ.566 మాత్రమే చెల్లించాలన్నారు. ఆసక్తిగల రైతులు AO కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.