VKB: కుల్కచర్లలోని ప్రతి పల్లెను అభివృద్ధి పథంలో నడిపించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆంజనేయులు అన్నారు. రైతు వేదికలో గురువారం నిర్వహించిన ‘ప్రగతిబాట ప్రజాపాలన’ కార్యక్రమంలో మాట్లాడారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం 99 రోజుల ప్రత్యేక ప్రణాళికను ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు.