MLG: వెంకటాపూర్ రామానుజాపూర్లో ఇవాళ నూతన డ్రైనేజీ పనుల ప్రారంభోత్సవం జరిగింది. రాష్ట్ర మంత్రి సీతక్క, DCC జిల్లా అధ్యక్షులు అశోక్ సూచనల మేరకు పంచాయతీరాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజా ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.