SDPT: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా చేర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మూడవరోజు జువాలజీ, బోటనీ, కెమిస్ట్రీ ల్యాబ్లను అధ్యాపకులు పరిశీలించారు. ఈ సందర్భంగా తరగతి గదులు, ల్యాబ్లను శుభ్రపరిచి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అధ్యాపకులు శ్రీనివాసరావు, టి.ప్రభాకర్, కె. సుదర్శన్ పాల్గొని, ప్రయోగశాలల నిర్వహణపై విద్యార్థులకు సూచనలు చేశారు.