మేడ్చల్: అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్లపట్టాలు ఇప్పించడానికి కృషి చేస్తామని టీయుడబ్ల్యూజే రాష్ట్ర కోశాధికారి మోతెవెంకట్ రెడ్డి తెలిపారు. బుధవారం మల్లాపూర్లోని ఎస్ఎల్ఎన్ఎస్ ఫంక్షన్ హాల్లో యూనియన్ నియోజకవర్గ అధ్యక్షుడు పళ్ళ మహేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉప్పల్ నియోజకవర్గ జర్నలిస్టుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.