NDL: నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి మాతకు ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి, ఛైర్మన్ పీవీ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం అమావాస్య సందర్భంగా పూజలు చేశారు. అర్చకులు తెల్లవారుజామున అమ్మవారిని పసుపు పారాయణంతో సింగారించి, విశేష పుష్పాలంకరణలో కుంకుమార్చన, రుద్రాభిషేకం, మహా మంగళహరతి పూజలు గావించారు. అమావాస్య కావడంతో భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.